4, ఏప్రిల్ 2010, ఆదివారం

సానియా వివాహం మీడియా అతి ఉత్సాహం

గత రెండు రోజులుగా ఎలక్ట్రానిక్ మీడియా సానియా వివాహ సందర్భంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే అస్సలు సంచలన వార్తల కోసం మన మీడియా ప్రతినిధులు ఎంతవరకైనా వెళ్తారని మరొక్కసారి నిరుపించుకున్నారు

ఒక అమ్మ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు . కాని వారిద్దరూ తమ తమ క్రీడలలో పేరొందిన క్రీడాకారులు కాబట్టి ఒక టీవీఛానల్ ప్రకారం వారు అన్ని విషయాలు గోప్యంగా ఉంచుతున్నారు .అంటే వీరి ఉద్దేశ్యంలో వారు ఇరువురు ప్రఖ్యాత క్రీడాకారులు గాబట్టి ప్రతి విషయం మీడియా ముందుకు వచ్చి వీరికి చెప్పాల్సిన అవసరం ఉంది.అంటే మేహేంది కార్యక్రమం కాని అదేవిధం నగల విషయం గాని వారు పెళ్లి రోజున వేసుకునే బట్టలవిషయం గాని ప్రతి విషయం ముందుగా వీరి చెప్పాలి లేకపోతె యింక వీరి ఇష్టం.

ఇంకొక ఛానల్ ఐతే శోయిబ్ ని దొంగ అల్లుడు గా చిత్రికర్రించి హెడ్ లైన్స్ అదే విధం గా చూపెట్టింది.
పెళ్లి అనేది వ్యక్తిగతం అని షోయాబ్ కి వేరొక వివాహం నిజంగా జరిగినా అది తనకి సానియాకు సంబందించిన విషయం అని అది కేవలం ఒక వార్తగా చుపెట్టాలేగాని వ్యక్తుల్లకి రకరకాలుగా పేర్లు పెట్టి వారిని దోషులుగా చూపెట్టడం ఎంతవరకు సబబు.
ఇంకపోతే శివసేన అధినేత ఎక్కడ ప్రజలు తమను మరిచిపోతారో అని అప్పుడప్పుడు ఒక ప్రకటన ఇస్తూ ఉంటారు
హైదరాబాద్ లో ఎన్నో కుటుంబాలు పాకిస్తాన్ కుటుంబాలతో వివాహ సంబంధాలు ఏర్పరుచుకొని హాయిగా ఉంటున్నారు.
ఈ మీడియా విచారణ ఎంతవారకు సమంజసం
హటాత్తుగా కొంతమంది విలేఖరులకు మరియు శివసేన అధినేతలకు సానియా లొఏం ప్రతిభ లేదని కేవలం అందంతో
పైకి వచ్చింది అని వ్యాఖ్యానించడం అతి శోచనీయం
ఇప్పటికైనా సానియా ని శోయిబ్ ని వడిలేసి. వారి వ్యకిగత జీవితాల్లో ఇదొక ముఖ్యమైన రోజు ,వారిని ఎంజాయ్ చేయనీయండి

ఏదైనా మంచి పోటిల గురించి కాని ఒక మంచి క్రీడాకారుడు కాని క్రీడాకారిణి గురించి కాని వారి వారు సాధిచిన విషయాలగురించి కాని చూపెట్టడానికి మన చన్నెల్స్ కు ఎక్కడ సమయం సరిపోదు . కాని ఇటువంటి విషయాలకోసం రాత్రింబవళ్ళు ఓ బి వాన్స్ పెట్టుకొని, ఇంతకూ ముందు సోహ్రాబ్ ఇంటిముందు పడిగాపులు కాసి ఆటను ఇంట్లోంచి బయటకు వస్తుంటే వెళ్తుంటే అయాదృశ్యాలను తీసి కేవలం మా చానెల్ ప్రత్యేకం అని వేసుకుని ఇపుడు అదే విధం గా సానియా ఇంటి ముందు కుర్చుని కాపలా కాస్తూ వీరి తో ఎవ్వరు మాట్లాడలేదని ఇక్కడ అన్ని గోప్యంగా జరుగుతున్నాయి అని ప్రసారం చేయడం ఎంతవరకు సమజసమో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం

అంటే కాదు కొన్ని చాన్నేల్స్ మరింత ముందుకు వెళ్లి అస్సలు వివాహమే రద్దు ఐపోయింది అని మరికొంతమది నిన్ననే నిఖా ఐపోయింది అని ప్రసారం చేసేసారు . అంటే వీరి ఉద్దేశ్యం ఏదో ఒక వార్తా ప్రసారం చేసేస్తే వాళ్లు ఖండిచడానికో లేకపొతే వివరణ ఇవ్వడానికో చచ్చినట్టు వస్త్తారని వ్యుహమా?
ఏది ఏమైనా కుడా మొత్తం వ్యవహారంలో మీడియా పాత్ర ఎ విధంగా చూసిన కూడా సమర్ధనియంగా లేదు
శ్రీ శ్రీ గారు అన్నట్టు వ్యక్తుల ప్రైవేటు జీవితాలు ఎవ్వరివి వారివి కాని పబ్లిక్ లొ వస్తే ఏమైనా అంటాం కొడుతాం కాని పడుండాలి అన్నది తుచ తప్పకుండ పాటిస్తున్నట్లు కన్పిస్తోంది . మహాకవి శ్రీశ్రీ అన్నది ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తుల గురించి వారి అవినీతి కార్యకలాపాల గురించి అంటే కాని వ్యక్తుల వ్యక్తిగత జీవితంలో దూరి వారి ని బజార్ కు ఈడ్చడం గురించి కాదు.

12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

జుస్టిస్ శ్రీ కృష్ణ కమీషన్ విధి విధానాలు

ఇప్పుడే ఇంటికి వచ్చి టీవీ చూస్తుంటే అప్పుడే జుస్టిస్ శ్రీ కృష్ణ కమిషన్ విధి విధానాలు ప్రకటించడం జరిగింది.
ఆ విధి విధానాలు పరిశీలించిన తరువాత అసలు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సమస్య పట్ల ఎమైన
చిత్తశుద్ధి ఉందా అన్న అనుమానం కలుగుతోంది.
విధివిధానాలలో ముఖ్యమైనవి 1956 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్త్రంలో వివిధ ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి, ఇంకా ప్రత్యెక తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో ఉద్భవించిన సమైక్య ఆంధ్ర ఉద్యమం తదుపరి పరిణామాలు వివిధ సంఘాలతో చర్చలు

ఇందులో మొదటి అంశమైన 1956 నుంచి జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి ఎటువంటి కమిటీ అవసరంలేదు

కేంద్రంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పధకాలు వాటి అమలు గురించి సమీక్షిస్తే
ప్రభుత్వ రికార్డ్స్ ఆధారంగా పూర్తీ వివరాలాతో లభ్యం అవుతాయి.అంతే కాదు ఈ విధి విధానాలలో ఎక్కడ పెద్దమనుషుల ఒప్పందం దాని ఉల్లంఘన 610 ప్రభుత్వ ఉత్తరువుల అమలు పరచకపోవడం వంటి అంశాలు గురించి ఎక్కడ ప్రస్తావన లేదు . ఒక విధంగా చూస్తే ఈ కమిటి విధి విధానాలు పూర్తిగా సమైక్య ఆంధ్ర నాయకుల సూచనల మేరకే వారికి అనుగుణంగా ఉన్దేవిధానంగా ఖరారు చేసినట్టుగా స్పష్టం అవుతోంది . ఎక్కడా ప్రత్యెక తెలంగాణా ఉద్యమ చారిత్రాత్మక నేపధ్యం తెలంగాణా ప్రాంత నిర్లక్ష్యం ఇక్కడి వెనుకబాటి తనం వాటి కారణాలు ఏవీ కూడా పరిగణలో తీసుకున్న దాఖలాలు ఏవి లేవు.కమిటి ద్వారా విచారించినా లేదా ప్రభుత్వ పధకాలు అమలు పరిశీలించినా తెలంగాణా ప్రాతం పూర్తిగా నిర్లక్ష్యం కి గురి ఐన సంగతి నూటికి నూరుపాళ్ళ నిజం' . ఈ కమిటి నియామకం తరువాత విధి విధానాలు ఖరారు గమనిస్తే తెలంగాణా ప్రజలను వారి మనోభావాలను మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ వంచించింది. డిసెంబర్ 9 వ తేది నాడు ప్రకిటించిన రోడ్ మ్యాప్ దాఖలాలు ఏవి ఈ విధి విధానాలలో లేవు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ కమిటి ని రద్దు పరిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కి గతంలో ప్రకటించిన విధంగా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి . ఈ కమిటి నియామకం తరువాత పరిణామాలు గమనిస్తే ఇవి కేవలం కాలయాపన కోసం తప్పిస్తే సమస్య పరిష్కారం కోసం కాదు .
నీటిరంగంలో, విద్య, వ్యవసాయం, వైద్య మరియు ఉద్యోగ రంగాలలో తెలంగాణ ప్రాతం పట్ల వివక్షత గురించి తెలిసుకోడానికి కేవలం ప్రభత్వ పధకాల అమలు గురించి రికార్డ్స్ పరిశీలిస్తే చాలు వీటి కోసం కమిటిల నియామకం అవసరంలేదు

ఇప్పుడే తెలిసింది తెలంగాణ తెదేపా శాసన సభ్యులు రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారని. ఈ నిర్ణయం పూర్తీ హర్షదాయకం . కాని ఈ నిర్ణయానికి ఆ సభ్యులు కట్టుబడి ఉండాలి. తెరాస మరియు తెదేపా శాసన సభ్యులు తమ తమ రాజీనామాల విషయంలో కట్టుబడి ఉంటె కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా తప్పనిసరిగా రాజీనామాలు చేయాల్సిన అవసరం వస్తుంది తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వత్తిడి పెంచ వచ్చు.
.

24, జనవరి 2010, ఆదివారం

రాజకీయ నాయకుల మౌనం వెనక కారణాలు ?

కేంద్ర హోం మంత్రి చిదంబరం తో భేటి ఐన తరువాత ఆ భేటి లో పాల్గొన్న రాజకీయ నాయకుల మౌనానికి కారణాలేమిటి?

మన రాష్ట్రం కి చెందిన ప్రధాన రాజకీయ పక్షాల ప్రతినిధులు కేంద్ర హోం మంత్రి తో భేటి ఐన తరువాత భేటి వివరాలు ప్రజలకు వివరించకుండా ఉండడంలో గల కారణాలు ఏమిటి అన్న ప్రశ్న ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న.


ఒక సున్నితమైన సమస్య మీద అఖిల పక్షం సమావేశం తరువాత ఆ సమావేశం వివరాలు గోప్యం గా ఉంచవలిసిన అవసరం ఏముంది.


ఒక్క ప్రక్క విద్యార్థులు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు . విద్యార్థులు తమ విద్య సంవత్సరము కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. వీరొక ప్రక్క నాయకుల ప్రకటనలు భిన్న స్వరాలూ పలుకుతున్నాయి. మొయిలీ గారు అసెంబ్లీ రద్దు పడకుండా చూస్కోండి అని మధు యాష్కీ గారు ఇచ్చిన ప్రకటన ఎటువంటి సంకేతాలు పంపుతోంది? అంటే కాంగ్రెస్ నాయకులు తమ రాజీనామాల విషయంలో పునరాలోచనలో ఉన్నారా అనే సందేహం కలుగుతోంది.
అంటే కాదు రెండు ప్రధాన పక్షాలు తమ తమ వైఖరి చెప్పకుండా తమ తమ పార్టీలలోని ఇరు వర్గాల నాయకులకు తమ పార్టీ వేదికలను తమ తమ అభిప్రాయాలను వ్యక్తికరించడానికి ఇవ్వడం ద్వారా వీరు ఆందోళనలో ఉన్న ప్రజలకు ఇచ్చే సంకేతాలేమిటి?


ప్రధాన పక్షాలు తమ వైఖరి స్పష్టం చేయడానికి సిద్ధంగా లేనప్పుడు వారి పార్టీ వేదికల ద్వారా తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకునే ఆస్కారం ఈ ప్రాంతీయ నాయకులకు ఇవ్వకుదు.
.

అదే విధంగా తెరాస అగ్ర నాయకత్వం కేంద్ర హోం మంత్రి భేటి తరువాత ఎటువంటి ప్రకటన చేయకపోడం కుడా ఉద్యమకారుల్లో కొంత ఆందోళన గురి చేస్తోంది.

విద్యార్థులకు ఒక్కటే మనవి . ఈ రోజు ఉన్న పోటీ తత్వ ప్రపంచంలో ఒక విద్య సంవత్సరం కోల్పోవడము అంటే చాలా నష్టంకలుగుతుంది కాబట్టి విద్యార్థులు కనీసం వారానికి మూడు రోజులు తరగతులకి హాజరై మిగతా రోజులలో ఉద్యమాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది అనే విషయం ఫై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ఎందుకంటే ఉద్యమంలో మిగతా వర్గాలు వారి వారి వృత్తులలో పని చేసుకుంటూ ఉద్యమమలో

అంతే కాదు తెలంగాణా కు చెందిన నాయకులు వారికి నిజంగా చిత్తసుద్ధి ఉంటె వారు హైదరాబాద్ లో టీవీచానల్స్ లో మరియు జాక్ మీటింగ్స్ లో కాలయాపన చేయకుండా వారి వారి నియోజకవర్గాలో ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంలో ప్రయత్నాలు చెయ్యాలి . ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం లేనిదే ఎటువంటి ఉద్యమం సఫలం కాదు

పిల్లి మేడలో గంట ఎవరు కడతారు అన్నట్టు రెండు ప్రధాన పక్షాలు ఒకరి ప్రకటన కోసం వేరొకరు ఎదురు చుస్తున్న్నట్టు ఉంది. ఈ క్రమంలో సామాన్య ప్రజలు విపరీతమైన ఆందోళనకు గురి అవుతున్నారు.

వేచి చూడు అనే సిద్ధాంతం రాజకీయాల్లో ఎల్లప్పుడూ సరి కాదు అనేది వర్తమాన పరిస్థితులు మనకు స్పష్టంగా చెపుతున్నాయి.
"సర్దార్ పటేల్ మాటల్లో చెప్పాలంటే రాష్ట్రం ఒక అందమైన ఖరీదైన శాలువా అది ఇప్పుడు ముళ్ళకంప లో చిక్కుకుపోయింది . గట్టిగా లాగితే అది ఊడి వస్తుంది కాని చీలికలు పెలికలైపోతుంది అలాగని చేతులు కట్టుక్లు కూర్చుంటే ముళ్ళు ఇంకా ఇంకా దిగబడి శాలువకు శాశ్వతంగా నష్టం కలుగ చేస్తాయి . ఒక్క పోగు కూడా రేగాకుండా ఒక్కొక్క ముల్లును తప్పించి శాలువా జాగ్రత్తగా ఇవతలకు తీయాలి"లు . ఈ వాక్యాలను పి .వి . నరసింహ రావు గారి లోపలి మనిషి అనే పుస్తకంనుంచి గ్రహించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు నిజాంప్రభుత్వానికి వ్యతిరేకం భారత ప్రభుత్వం సైనిక చర్య సందర్బ్ఘంగా సర్దార్ పటేల్ గారు చేసినవి. ఈ రోజు తెలంగాణ ఉద్యమానికి సంభదించి వర్తమాన పరిస్త్తితులకు ఇవి చక్కగా సరిపోతాయి.

ఇరు వర్గాలప్రజల మధ్య ఒక సున్నితమైన విభజన మానసికంగా వచ్చిన్నట్టు మనకు ప్రస్పష్టంగా కనిపిస్తోంది.
ఇకనైనా అన్ని ప్రధానపక్షాలు , రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తమ దృష్టి ని వెంటనే ఈ సమస్యపై కేంద్రీకరించి తక్షణ పరిష్కారం దిశ గా ఇంకా ఎటువంటి కాలయాపన చేయకుండా ప్రయత్నించాలి....

23, జనవరి 2010, శనివారం

ఐపీఎల్ ప్రా రామ్ భోత్సవ మ్యాచ్ ను ను ముంబై కి తరలించడం ఎంతవరకు సమంజసం ?

ఐ పీ ఎల్ ప్రారంభోత్సవ పోటి ని ముంబై కి తరలించడం ఎంతవరకు సమంజసం అన్నది ఈ రోజు ప్రతి డెక్కన్ చార్జెర్స్ అభిమాని లో మెదులుతున్న ప్రశ్న . ఐ పీ ఎల్ అధికారులు ఎవరిని సంప్రదిచకుండా ఇటువంటి నిర్ణయం తీసుకొనడం ఎంత వరకు సమంజసం . ప్రత్యేకించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు ఇన నేపధ్యంలోఅంతే కాదు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఒక భాద్యతయువమైన పదవీలో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు ఎటువంటి సంప్రదింపులు లేకుండా తీస్కోనదము కేవలం భాద్యత రాహిత్యం.
ఇక్కడ ఒక్క విషయం గమనించాలిసింది ఏమిటంటే , మొన్న పాకిస్తాన్ క్రీడాకారులను ఐ పీ ఎల్ వేలం పాటలో నిర్లక్ష్యం చేయడంలోనూ ఈవ్వాళ్ళ హైదరాబాద్ నుంచి మ్యాచ్ తరలిచండంలోను ఐ పీఎల్ అధికారులు ఒక రకమైన ఏకచత్రాధిపత్యం వహిస్తున్నరన్నది బహిరంగ సత్యం. పాకిస్తాన్ క్రీడాకారులను వేలం పాటలో నిర్లక్ష్యం చెయాడాన్ని ఎన్ని విధాల సమర్ధించుకున్న వారిని ఒక పథకం ప్రకారం వేలం పాటనుంచి బయట ఉంచారన్న సంగత ప్రతి ఒక్క క్రీడా అభిమాని కి తెలిసిన సంగతే .
కామన్ వెల్త్ గేమ్స్ లాంటి ప్రతిష్టాకరమైన పోటిలలో కూడా ఒక అధికారి వేదికలను పర్యటించకుండా సంభదిత అధ్జికరులను సంప్రదిచకుండా ఎటువంటి నిర్ణయాలు తీస్కోవడము జరగదు. అటువంటిది మార్చ్ లో జరిగే ప్రారంభోత్సవ మ్యాచ్ గురించి సంభదిత రాష్ట ప్రభువాత్వాన్ని మరియు క్రికెట్ అసోసియేషన్ ను సంప్రదిచకుండా ఇటువంటి నిర్ణయాలు తీస్కొనడం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర అనుమానులు వ్యక్తికరిస్తున్నారు.
గతంలో హైదరాబాద్ జరిగిన ప్రపంచ బాడ్మింటన్ పోటిలప్పుడు భద్రతకు సంబంధించి అనుమానాలు వ్యక్తం ఐనప్పుడు కేంద్ర హోం మంత్రి చిదంబరం గారు స్వయాన హామీ ఇచ్చి ఆయన ఎటువంటి సెక్యూరిటీ లేకుండా badminton పోటీలు వీక్షించడము మనందరకూ తెలిసిన విషయమే .
అటువంటిది ఈ రోజు లలిత్ మోడి ఎవరిని సంప్రదించకుండా పోటీలను ముంబై కి మార్చడం వెనక గల కారణాలు ఏమిటో అన్న విషయాలు ప్రతి ఒక్క హైదరాబాద్ క్రికెట్ అభిమాని ఆలోచించాల్సిన విషయము . అంతే కాదు ఒక అంతర్జాతీయ పోటికి సంబదించిన విషయాలు దానికి సంబందిచిన అధికారులు ఇంత అనాలోచితంగా తీసుకుంటుంటే అంతర్జాతీయంగా మనము ఎటువంటి సంకేతాలు పంపిస్తున్నాము అన్న విషయము కూడా ఆలోచించాల్సిన తరుణం కూడా ఆసిన్నమైందన్న విషయం మనము ఎంతైనా గుర్తుంచుకోవాలి.